30.7 C
Hyderabad
April 19, 2024 09: 56 AM
Slider ప్రకాశం

కొనకమిట్లలో ఘోర ప్రమాదం: నలుగురి మృతి

accedent 12 12

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. వేగంగా వెళుతున్న తుఫాన్‌ వాహనం, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు బల్లారి నుండి చీమకుర్తికి తుఫాన్‌ వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది.

తుఫాన్ డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతులు కర్ణాటక వాసులు గా గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పొదిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఛీటింగ్: ప్రేమికుడిపై కోపంతో ఆత్మహత్య

Satyam NEWS

విత్తన వివాహ ఆహ్వాన పత్రిక!

Sub Editor

అధిక వర్షాల వలన నష్టపోయిన  రైతులను ఆదుకోవాలి

Murali Krishna

Leave a Comment