35.2 C
Hyderabad
April 20, 2024 17: 58 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ గవర్నర్ తో పురందేశ్వరి భేటీ

purandeswari

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో ఆంధ్రప్రదేశ్ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేడు రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన వీరిద్దరి భేటీలో పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. పురందేశ్వరి కేంద్ర మంత్రిగా పని చేసినప్పటి నుంచి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తో స్నేహ పూర్వకంగా ఉండేవారు.

బిజెపిలో చేరిన తర్వాత వారిద్దరి సఖ్యత మరింతగా బలపడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళా నాయకురాళ్లు రాజకీయ విషయాలను చర్చించుకున్నారు. తమిళనాడు బిజెపిలో చురుకుగా వ్యవహరించిన తమిళపై సౌందర రాజన్ పట్ల దగ్గుబాటి పురందేశ్వరి తొలి నుంచి సానుకూలంగా ఉండేవారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన మేఘారెడ్డి

Satyam NEWS

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణంపై సమీక్ష‌

Satyam NEWS

ఉద్యోగులకు ఐఆర్ మరింత పెంచాలి

Satyam NEWS

Leave a Comment