తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో ఆంధ్రప్రదేశ్ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేడు రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన వీరిద్దరి భేటీలో పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. పురందేశ్వరి కేంద్ర మంత్రిగా పని చేసినప్పటి నుంచి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తో స్నేహ పూర్వకంగా ఉండేవారు.
బిజెపిలో చేరిన తర్వాత వారిద్దరి సఖ్యత మరింతగా బలపడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళా నాయకురాళ్లు రాజకీయ విషయాలను చర్చించుకున్నారు. తమిళనాడు బిజెపిలో చురుకుగా వ్యవహరించిన తమిళపై సౌందర రాజన్ పట్ల దగ్గుబాటి పురందేశ్వరి తొలి నుంచి సానుకూలంగా ఉండేవారు.