ముషీరాబాద్ గాంధీనగర్లో విషాదం నెలకుంది.అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ముషీరాబాద్ గాంధీనగర్కు చెందిన ఆవుల రాజు, దివ్య, ప్రేమ్ నాథ్ రామనాథం లు గా గుర్తించారు. వీరిలో రాజా, దివ్య దంపతులు. డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ముషీరాబాద్ గాంధీనగర్ లో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.అయితే వీరికి ప్రేమనాథ్ రామనాథం స్నేహితుడని తెలుస్తుండగా అతని స్వస్థలం లాంటి వివారాలు ఇంకా తెలియలేదు.కాగా వీరి మృతదేహాలను త్వరగా తీసుకు రావడానికి త్వరగా హైదరాబాద్ కు తీసుకు రావడానికి చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు మంత్రి కేటీఆర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
2 comments
Good information
Yesterday bad is today’s good and tomorrow’s –?