ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ట్రక్కు, వ్యాను ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద సంఘటన ఘటన బాంగర్ మావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వే టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, మారుతి వ్యాను ఢీ కొన్నాయి.
వెంటనే వ్యాన్ అంతటా మంటలు వ్యాపించాయి. దీంతో వ్యానులో ఉన్నవారు బయటపడలేక సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.