కామారెడ్డి జిల్లా మద్దూనురు మండలంలోని పెద్ద ఎక్లారా గేట్ వద్ద గల బాలికల గురుకుల పాఠశాల అదనపు తరగతుల నిర్మాణ భవనాలకు జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులతో పాటు ఎమ్మెల్యే కూడా చిందేసి విద్యార్థులకు ఉత్సాహం నింపారు.
అనంతరం పాఠశాల తరపున ఎమ్మెల్యేకు సన్మానం చేయగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థిని చదవడానికి గురుకుల పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్, బండు పటేల్, శ్రీను పటేల్, ప్రిన్సిపాల్ జనార్ధన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినులు పాల్గొన్నారు.