39.2 C
Hyderabad
March 29, 2024 13: 32 PM
Slider ఆంధ్రప్రదేశ్

న్యూ డైమన్షన్: ఇదేమి ట్విస్టు సోదరా?

amaravathi 26

రాజధాని తరలింపు నిర్ణయం నేపథ్యంలో ఇంతకాలం కొత్త భవనం లీజుకు తీసుకోవాలో వద్దో తెలియక తికమక పడిన ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు అమరావతి ప్రాంతంలోనే మరో భవనంలోకి మారింది. నాలుగేళ్లుగా తాడేపల్లి లో కొనసాగుతున్న ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్‌ రోడ్డు(శ్రీరామ్‌నగర్‌-ఆత్మకూరు గ్రామం)లోని నీలాద్రి టవర్‌-3,4,5 అంతస్థులలోకి తరలింది.

ఇక నుంచి మండలి కార్యకలాపాలు అక్కడ నుంచే నడుస్తాయి. లీజు ఒప్పందం మేరకు దాదాపు రూ.25లక్షలు అద్దెకింద అడ్వాన్స్‌ గా చెల్లించిన మండలి, గత డిసెంబరులోనే కొత్త భవనంలోకి తరలించాల్సి ఉంది. అయితే రాజధాని మార్పుపై కొంత ఊగిసలాడినప్పటికీ ఎట్టకేలకు కొత్త భవనంలోకి మార్చారు.

Related posts

ఉత్తరాదిన క్రేజ్ పుట్టినస్తున్న సమంత చిత్రం యశోద

Satyam NEWS

ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..

Sub Editor

నీట్, జేఈఈ విద్యార్థులకు ఈ-మెటీరియల్ డిజిటల్ కార్డు

Satyam NEWS

Leave a Comment