ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ రాగాలు తీస్తున్నాడేమో భారత పర్యటనపై తనకు ఉన్న ఆసక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తపరిచారు. ఈసారి ప్రధాని వెూడీకి తనకు మధ్య ఉన్న ఓ కామన్ పాయింట్ని తెరమిదరకు తెచ్చారు. ఫేస్బుకలో ట్రంప్ నంబర్ వన్ అని తర్వాత వెూడీ ఉన్నారని ఆ సంస్థ అధినేత జుకర్బర్గ్ తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా ట్రంప్ ఉటంకించారు.
త్వరలో తాను భారత్లో పర్యటించబోతున్నానని, దానికోసం ఆసక్తిగా వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఢిల్లీ, అహ్మదాబాద్లో ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ ఆయన సతీమణితో కలిసి పర్యటించనున్నారు. అహ్మదాబాద్లో లక్షలాది మంది ప్రజలు తనకు స్వాగతం చెప్పబోతున్నట్లు వెూడీ తనతో చెప్పారన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉంది.