36.2 C
Hyderabad
April 25, 2024 20: 01 PM
Slider తెలంగాణ సినిమా

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన యాంకర్ సుమ

suma

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి  సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా  ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, యాంకర్ అనసూయ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అని పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనకు ఊపిరి శ్వాస అని ఆ శ్వాసస కు మూలం అయిన ఆక్సిజన్ అని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెంచాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. చాలా కాలం తర్వాత గార్డెనింగ్ చేసే అదృష్టం కలిగిందని. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మొక్కల చాలెంజ్ ను సెలబ్రిటీస్ ఇలాగే కంటిన్యూ చేయాలని కొరారు. భావితరాలు సుఖంగా ఉండాలి అన్న గ్లోబల్ వార్మింగ్ పోవాలన్న ప్రతిఒక్కరు మొక్కలు పెంచాలని కొరారు హరితహారం లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడం చాలా సంతోషకరమని సీఎం కేసీఆర్ కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సుఖాలు ఉన్న మనకు మంచి వాతావరణం ఉంటే ఆనందంగా ఉంటామని.  “మొక్కలు నాటుదాం- ప్రకృతిని అందంగా ఉంచుదాం- మనందరం ఆనందంగా ఉందామని “ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అదేవిధంగా  నేను మరొక నలుగురిని చాలెంజ్ లోకి ఆహ్వానిస్తున్నాను అందులో 1) ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు 2)  మంచు లక్ష్మి  3)బిగ్ బాస్ షో 3 విజేత రాహుల్ 4) యాంకర్ ఓంకార్ వీరు కూడా మొక్కలు నాటుతారు ఆశిస్తున్నాను అని తెలిపారు.

Related posts

కార్యకర్తలను పరామర్శించిన భట్టి విక్రమార్క

Bhavani

పాపం తమిళ సై: ఇక తెలంగాణ లో పని చేయడం కష్టం

Bhavani

కాంగ్రెస్ పై పువ్వాడ ఫైర్

Bhavani

Leave a Comment