30.7 C
Hyderabad
April 19, 2024 09: 46 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం

YS Jagan Review Meeting_2_0

ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ప్రతి స్కూల్ ను ఆధునీకరించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వచ్చే నెల 14 నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నాడు- నేడు అని ఈ స్కూళ్ల ఆధునీకరణ కార్యక్రమానికి పేరు పెట్టారు. ప్రతి ఏడాది 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో 6 వేల కోట్ల రూపాయలు ఈ పథకంపై ఖర్చు చేస్తారు. నేడు స్కూల్ ఎలా ఉంది.. నాలుగేళ్ల తరువాత ఎలా ఉందో ఫొటోలతో ప్రజల ముందుంచాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ పథకంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్ లతో కాకుండా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి దేశంలోనే తొలిసారి ఈ కార్యక్రమం కోసం అమలు చేయాలని సిఎ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Related posts

ఒకే గొడుగు కిందకు మొత్తం నీటిపారుదల శాఖ?

Satyam NEWS

చినజీయర్ పర్యటన తర్వాత టెంపుల్స్ పై పోలీసులు మరింత దృష్టి…!

Satyam NEWS

ముత్యoధార లో చిక్కుకున్న వారు సేఫ్

Bhavani

Leave a Comment