37.2 C
Hyderabad
April 19, 2024 13: 50 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

వెండి కిరీటం ఉంగరాలు గోవిందో గోవిందా

pjimage (3)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మత సంబంధమైన మరో వివాదం చుట్టుముట్టబోతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీ నుంచి 5 కిలోల బరువు గల వెండి కిరీటం, రెండు ఉంగరాలు మాయం కావడం పై బిజెపి ఆందోళనకు సిద్ధం అవుతున్నది. ఈ నగలు మాయమైనట్లు 2018 మే 5న దేవస్థానం అధికారుల దృష్టికి వచ్చిందని, అసలు ఏం జరిగిందో ఇన్ని రోజులు భక్తులకు ఎందుకు చెప్పలేదని బిజెపి నాయకుడు భానుప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి బాధ్యుడిని చేస్తూ ఏఈవో శ్రీనివాసులుపై రూ.7,76 లక్షల రికవరీపెట్టారని ఆయన తెలిపారు. అసలు ఒక్క వ్యక్తే.. ట్రెజరీ నుంచి ఈ నగలను ఎలా మాయం చేస్తాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎవరిని కాపాడేందుకు ఇన్ని రోజులు ఈ వ్యవహారాన్ని దాచిపెట్టారని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసుల నెల జీతం రూ.28 వేలు అని, అతడి జీతం నుంచి ఎలా మినహాయించుకుంటారని ప్రశ్నించారు. ఈ ఘటనపై  శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈవో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రేపు ఉదయం టిటిడి ఎడ్మినిస్ట్రేటీవ్ భవనాన్ని మట్టడిస్తామని హెచ్చరించారు.

Related posts

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి ఎంపీ రఘురామ లేఖ

Satyam NEWS

ప్రపంచ ఆవిష్కరణ మరియు సృజనాత్మకత దినోత్సవం

Satyam NEWS

క్షేత్ర స్థాయిలో బాధితులకు మహిళా పోలీసులు అండగా నిలవాలి

Satyam NEWS

Leave a Comment