ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనక దుర్గమ్మ ను ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ నేడు దర్శనం చేసుకున్నారు. పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలి సారిగా కనకదుర్గ దేవాలయానికి విచ్చేశారు. ఆమెకు ఆలయ అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం దేవాలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సురేష్ బాబు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా లో దుర్గమ్మ ను దర్శించుకోవడం సంతోషమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు కు పెద్ద పీట వేస్తున్నారని ఆమె వివరించారు. గురువారంనాడు ఆమె రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
previous post