32.2 C
Hyderabad
March 28, 2024 23: 55 PM
Slider ఆంధ్రప్రదేశ్

కనకదుర్గమ్మను దర్శించుకున్న చీఫ్ సెక్రటరీ నీలం సహానీ

gov neelam

ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనక దుర్గమ్మ ను ఆంధ్రప్రదేశ్  తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ నేడు దర్శనం చేసుకున్నారు. పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలి సారిగా కనకదుర్గ దేవాలయానికి విచ్చేశారు. ఆమెకు ఆలయ అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం దేవాలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సురేష్ బాబు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా లో దుర్గమ్మ ను దర్శించుకోవడం సంతోషమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు కు పెద్ద పీట వేస్తున్నారని ఆమె వివరించారు. గురువారంనాడు ఆమె రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Related posts

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణంపై సమీక్ష‌

Satyam NEWS

ప్రకృతి వనంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

Satyam NEWS

స్పెషల్ పార్టీ పోలీసులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ

Satyam NEWS

Leave a Comment