31.7 C
Hyderabad
April 19, 2024 00: 11 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

190271-gh

ఇంటిని ఖాళీ చేయాలని  కోరుతూ చంద్రబాబు ఇంటికి శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. వీఆర్ఓ ఇవాళ నోటీసులను అందించారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున  ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.ఎగువ నుండి  వరద నీరు వస్తున్నందున  శుక్రవారం నాడు చంద్రబాబునాయుడు నివాసం మెట్ల వద్దకు నీరు చేరుకొంది. శుక్రవారం సాయంత్రానికి మరింత వరద పెరిగింది. శనివారం నాడు చంద్రబాబునాయుడు నివాసం పక్కనే ఉన్న అరటితోటలోకి నీరు చేరుకొంది. దీంతో ఇంటిని ఖాళీ చేయాలని కోరుతూ  చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేశారు. కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో కొన్నింటికి ఇప్పటికే  నీరు వచ్చింది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం  నాడు చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ కెమెరాలతో రికార్డు చేశారు. హై సెక్యూరిటీ జోన్ లో అనుమతి లేకుండా ఎలా డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

Related posts

రాపిడ్ టెస్టింగ్ కిట్ పేరుతో జరుగుతున్న దోపిడి

Satyam NEWS

క‌ర్ఫ్యూ లో రోడ్ల‌పైకి ఏంటీ? ఎస్పీ సూచ‌న‌ల‌తో జ‌రిమానాలు

Satyam NEWS

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రోడ్లు అధ్వాన్నం

Satyam NEWS

Leave a Comment