రౌడీ షీటర్ బెల్ట్ మురళిని గత నెల 21వ తేదీ తిరుపతి లో కొందరు బహిరంగంగా నరికి చంపారు. ఆ కేసును పోలీసులు ఛేదించారు. సంచలనం రేపిన బెల్ట్ మురళి హత్య కేసును పోలీసులు ఇంత త్వరగా ఛేదించడంపై ఎస్పి గజ రావ్ భూపాల్ పోలీసులను అభినందించారు.
ఇంతకీ బెల్ట్ మురళిని ఎవరు చంపారనే దానికి సమాధానంగా తిరుపతి, రేణిగుంట కు చెందిన 17 మంది ముద్దాయి లను అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వారు హత్యకు ఉపయోగించిన ఆటో, స్కూటీ మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
2017 లో మురళి, ప్రమోద్ కొంత మంది స్నేహితులు కలిసి సాకే భార్గవ్ అనే వ్యక్తిని హత్య చేసారు. తిరుపతి పరకాల వీధి లో 2017 లో జరిగిన భార్గవ్ హత్యకు ప్రతీకారంగానే పసుపులేటి మురళి ని హత్య చేసినట్టు పోలీసులు ముందు నిందితులు ఒప్పుకున్నారు.