విజయవాడలోని భవాని పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలికపై అత్యాచారం జరిగింది. పూల డెకరేషన్ పనులకు వెళ్లే బాలికను పెళ్లి చేసుకుంటానని సాయి అనే ఒక వ్యక్తి నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.
సాయి తో పాటు అతని స్నేహితులు కూడా కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భవానిపురం పోలీసులు సాయి తో పాటు అతని స్నేహితుల పై అత్యాచారం కేసు నమోదు చేశారు.