37.2 C
Hyderabad
March 29, 2024 20: 31 PM
Slider ప్రత్యేకం

పొలిటికల్ ఫెస్టివల్: భోగి మంటల్లో బోస్టన్ నివేదిక

tdp bhogi

భోగి పండుగను తెలుగుదేశం పార్టీ వెరైటీగా చేసుకుంటున్నది. జి ఎన్ రావు కమిటీ నివేదికలను, బోస్టన్ కమిటీ నివేదికలను తగులబెట్టి నిరసన కం పండుగ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నది. గొల్లపూడి 1 సెంటర్ లో భోగి మంటలు వేసి అందులో జి.యన్.రావు ప్రతిపాదనలు, బోస్టన్ ప్రతిపాదనలు, హై పవర్ కమిటీ అజెండా పత్రాలను గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా తగులబెట్టారు.

అమరావతి పరిరక్షణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో మహిళలకు, రైతులకు మద్దతుగా “సంక్రాంతిని అమరావతి సంక్రాంతి” గా నిర్వహిస్తూ, గొల్లపూడి 1 సెంటర్ లో ఈ విధంగా భోగి మంటలు వేశారు. జేఏసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను జేఏసీ నాయకులతో పాటు అన్నీ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు, విద్యార్ధి సంఘాలను కలుపుకొని ఈ “సంక్రాంతిని అమరావతి సంక్రాంతి” గా నిర్వహించారు. అదే విధంగా ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ జీఎన్ రావు కమిటీ ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలియచేశారు.

Related posts

రేపు అల్పపీడనం!

Sub Editor

సీఎం పర్యట‌నా సభా స్థలిని పరిశీలించిన డీఐజీ

Sub Editor

తాగిన మత్తులో మాట్లాడుతున్న మంత్రి నాని

Satyam NEWS

Leave a Comment