మంత్రిని అయినా తనను అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసు గుర్తించకపోవడంతో పాటు అడ్డుకున్నందుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఓ బిహార్మంత్రికి.సివాన్ నగరంలో ఆసుపత్రికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ భద్రత కోసం నియమించిన పోలీసు అధికారి ఒకరు మంత్రిని గుర్తించకపోవడమే గాక, ఆయన లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సదరు పోలీసు అధికారిపై మంత్రి మంగళ్ పాండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది తనను అవమానించినట్టే భావిస్తున్నానని ,మంత్రిని గుర్తించలేని ఇలాంటి పోలీసులను ఎందుకు నియమిస్తారు’ అంటూ సబ్ డివిజినల్ పోలీస్ అధికారిపై అయన మండిపడ్డాడు. అతడిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.