ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని తరిమికొట్టాలి అని జాతీయ బి.సి.కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ 22వార్డలోన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాలనీకి చెందిన పేద కుటుంబలైన వారికి దాదాపుగా 100 కు పైగా వారికి నిత్యావసర సరుకులైన బియ్యం,4 రకాల కూరగాయలు,మస్కులు,షానిటైజర్లు అందజేశారు.
ఆచారి మాట్లాడుతూ కరోనా నిర్ములనలో ప్రతి ఒక్కరు బాధ్యతగ ప్రధాని చెప్పిన సూచనలు పాటించి మేముసైతం అంటు దేశ రక్షణలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిత్యావసరాల దాత నాగుల వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోగిలి దుర్గాప్రసాద్, బి.సి సబ్ ప్లాన్ తాలూకా అధ్యక్షుడు రాజేందర్, బీజేపీ నాయకులు శేఖర్ రెడ్డి, నర్సింహ, విజయ్,శ్రీకాంత్, స్వామివివేకానంద సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు.