బిచ్కుంద మండలంలోని గుండె కల్లూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాధవరావు పటేల్ శుక్రవారం రోజు ఉదయం అకాల మరణం చెందారు. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టం చేసేందుకు ఎంతగానో కృషి చేశారని పార్టీ అధ్యక్షులు కిష్టారెడ్డి అన్నారు.
గ్రామస్థాయి నుండి మండల జిల్లా స్థాయి వరకు ఎదిగిన ఆయన మృతి పార్టీకి తీరని లోటని మాజీ శాసనసభ్యురాలు అరుణతార అన్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరిగాయి. ఆయన మరణించిన వార్త తెలియగానే పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.