కొల్లాపూర్ మీదుగా జాతీయ రహదారి ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయనందున తక్షణ చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకుడు ఎల్లేని సుధాకర్ రావు కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో నేడు ఆర్ అండ్ బి కార్యదర్శి సునీల్ శర్మను కలిశారు. ఈ ప్రతిపాదనపై ఆయనతో కూలంకషంగా చర్చించారు.
ఈ ప్రతిపాదనలో ముఖ్యమైన సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని సుధాకర్ రావు కార్యదర్శిని కోరారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే చాలని ఆయన అన్నారు. కొల్లాపూర్ నోటికాడికి వచ్చిన ముద్దను రాష్ట్ర ప్రభుత్వం ఆపిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్రానికి ప్రతిపాదన పంపాలని.. కొల్లాపూర్ అభివృద్ధికి సహకరించాలని సుధాకర్ రావు కోరారు.