బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు తన పై లైంగికదాడికి పాల్పడ్డాడని రాధారమణి అనే మహిళా సైబరాబాద్ పోలీసు కమీషనర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది.ఆర్.సీ.పురంకీ చెందిన రాధారమణికీ తన భర్తతో విభేదాలు రావడం వలన 2003 లో ఆర్.సీ.పురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి స్థానిక అడ్వకేట్ రఘునందన్ సలహా మేరకు భర్త పై మెయింటెనెన్స్ కేసు వేసింది.
2007 లో అడ్వకేట్ రఘునందన్ రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీ లో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొంది..అప్పటి నుండి రఘునందన్ రావు నా దగ్గర నీ అశ్లీల చిత్రాలు ఉన్నాయని బయట ఎవరికైనా చెబితే అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పెడుతానంటు బెదిరించి తనపై ఆత్యాచారం చేసేవాడని పేర్కొంది.
తానూ బయపడి అతను చెప్పినట్లు చేసేదానినని,ఈ విషయమై హెచ్చార్సీ ని ఆశ్రయించగా రఘునందన్ రావు పై కేసు నమోదు చేయాలని గత నెలలో ఆర్డర్ ఇచ్చారని తెలిపారు.ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని సీపీ సజ్జనార్ ను కలవడం జరిగిందన్నారు.కాగా ఈ ఆరోపణలు నిజామా అబద్దమా, రఘనందరావు ఫై ఎవరైనా ఇలాంటి అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారా అనేది అంటూ చిక్కకుండా ఉంది.ఈ విషయమై రగుణదన్రావు స్పందించాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు.