35.2 C
Hyderabad
April 20, 2024 17: 23 PM
Slider ఆంధ్రప్రదేశ్

నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాలు

dead bodies

గోదావరి నదిలో బోటు మునిగి మూడు రోజులయింది. ఎంత గాలించినా మృతదేహాలు దొరకడం లేదు. సహయక చర్యలకు పరిస్థితులు సహకరించలేని దుస్థితి. అందరు చేతులేత్తేశారు. పాపం ఏలా బందువుల్లో దు:ఖం…ఏడ్చి ఏడ్చి అలసి కన్నీరు కూడా రాలేని వైనం.. ఏవరు ఏమి చేయకున్న ..గల్లంతయిన వ్యక్తుల శవాలు ఒక్కోక్కటి ఒడ్డుకు కోట్టుకోస్తున్నాయి. నీటిలో ఉబ్బి పోయి చిద్రమయి చితికి పోయిన శవాలు ఇప్పటికే 8 లభ్యం కాగా మరికొన్ని లభ్యమయ్యే అవకాశముంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయిన మ తదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. మంగళవారం ఉదయం ఎనిమిది మ తదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో మూడు, పోలవరం ఒకటి మ తదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బ ందాల గోదావరిని జల్లెడ పడుతున్నాయి. గాలింపు కోసం చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఇప్పటి వరకు లభించిన మ తదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మ తదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్‌ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్‌లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 16 మ తదేహాలు లభించగా, మరో 30 మ తదేహాలను గుర్తించాల్సి ఉంది.

Related posts

సందిగ్ధం నుంచి సగం క్లారిటీ వచ్చిన సెల్ఫ్ డిస్మిసల్

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులు అటాచ్‌

Bhavani

రూ.3 కోట్లతో గ్రానైట్ టైల్స్ ఫుట్ పాత్ రోడ్డు పనులు

Satyam NEWS

Leave a Comment