33.2 C
Hyderabad
April 26, 2024 02: 29 AM
Slider తెలంగాణ

మట్టిపైపుల కంపెనీలపై జిఎస్టీ 12 శాతానికి తగ్గించాలి

mud pipes

పర్యావరణాన్ని కాపాడే మట్టి పైపుల పై జిఎస్టి తగ్గిస్తే కంపెనీలు సక్రమంగా నడుస్తాయని దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని తెలంగాణ SWG పైప్ కంపెనీల అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు పి వరప్రసాద్ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు వినతి పత్రం సమర్పించారు. ఇప్పుడు ఉన్న 18% జిఎస్టి నీ 12% కి తగ్గించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల చుట్టూ పక్కల ఉన్న 26 పైపుల కంపెనీలు ఉన్నాయని అవన్నీ ఇప్పుడు ఉన్న 18% జి.ఎస్.టి వలన నష్టాలు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. మట్టి పైపుల కంపనీలు ఎకో ఫ్రెండ్లీ పైపుల కంపెనీలు కావడం వల్ల వాటిని ప్రోతాహించాలని కేంద్ర మంత్రిని కోరామని తెలిపారు.

Related posts

ఎల్లారెడ్డి లో గులాబీ జెండా ఎగరడం ఖాయం

Satyam NEWS

ఎన్టీఆర్ తో నటించే అవకాశం జాన్వీ స్వీకరిస్తుందా?

Satyam NEWS

ప్రజా రాజధాని అమరావతిని కేంద్రం కాపాడాలి

Satyam NEWS

Leave a Comment