ప్రశాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాను కూడా వైసిపి ప్రభుత్వం నరకంగా మారుస్తున్నదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాను ప్రశాంతంగానే ఉండనీయాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వ బాధితుల శిబిరంలో చంద్రబాబు నేను ప్రసంగించారు. ఈ సమావేశానికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల బాధ, ఆవేదన చూస్తుంటే కక్షగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసులు ఇప్పటికైనా మారాలని, పోస్టింగుల కోసం తప్పుడు కేసులు పెట్టొద్దన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. అయ్యప్ప మాలలు వేసుకుని బూతులు తిట్టే పరిస్థితికి వచ్చారని, చివరకు వేంకటేశ్వరస్వామికి సవాల్ కూడా విసురుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.