చైనా కరోనా వైరస్ తో వణికిపోతున్న నేపత్యం లో అక్కడి నుండి వచ్చిన ఇండియన్ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.చైనాలోని వుహాన్లో చదువుతున్న ఇండియాకి చెందిన 25 మంది విద్యార్థులు కరోనా వైరస్ ప్యాపిస్తున్న నేపథ్యం లో ఇండియాలోని తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో కరోనావైరస్ యొక్క లక్షణాలు ఉన్నాయా లేదా అని అధికారులు జాగ్రత్తగా పరీక్షలు చేసారు.
ఇండియా లో ఈ వ్యాధి వ్యాపించకుండా ముందు జాగ్రత్త తో నే ఈ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.కాగా వుహాన్లోని మాంసం మార్కెట్ నుండి ఈ వైరస్ మానవులకు వ్యాపించగా, ఇప్పటికే చైనాలోని ఐదు నగరాలు కరోనా వైరస్ తో వణికిపోతున్న సంగతి తెలిసిందే.