ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతన్ బీబీ మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని అలీ ఇంటికి చేరుకుని పరామర్ళించారు. అలీ తల్లి జైతన్ బీబీ పార్థివ దేహం వద్ద ఆయన నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమండ్రిలో చనిపోయిన విషయం సత్యం న్యూస్ పాఠకులకు తెలుసు.
ఆమె భౌతిక కాయాన్ని గురువారం ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి అలీ ఇంటికి బయలుదేరి వెళ్లారు. చాలాసేపు అక్కడే గడిపి అలీని, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.