చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ ఉగాదికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తాజాగా శ్రీరామ నవమి రోజున విడుదల చేయాలని అనుకుంటున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో కథనాయికగా కాజల్ నటిస్తుండగా, చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 2 వ తేదీకి ఫస్టులుక్ ను రిలీజ్ చేసే పనిలోనే కొరటాల వున్నాడని అంటున్నారు.
చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే టాక్ వినిపించిన దగ్గర నుంచి, ఆయన ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.