39.2 C
Hyderabad
March 28, 2024 15: 33 PM
Slider రంగారెడ్డి

ది ఎండ్ :చిరుతను పట్టుకు తీసుకెళ్లిన అధికారులు

chirutha rescue team

షాద్‌నగర్‌లోని పటేల్‌ రోడ్డులో ఓ చిరుత కలకలం సృష్టించింది.షాద్‌నగర్‌లోని ఓ ఇంటిపై ఈ రోజు తెల్లవారుజామున స్థానికులకు చిరుత కనిపించింది. భయభ్రాంతులకు గురైన వారు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమీపంలో ఉన్న కమ్మదనం అటవీక్షేత్రం నుంచి వచ్చిన చిరుతపులి మన్నె విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి ఇంటిపై సేదతీరుతూ కనిపించింది.

చిరుతను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. అటవీశాఖ సిబ్బంది చిరుతకు మత్తు ఇచ్చి పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు..

Related posts

కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లో ఉపాధి అవకాశాలు

Satyam NEWS

బాలికల సదనం పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ

Satyam NEWS

గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా

Satyam NEWS

Leave a Comment