కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును శాసనసభ్యులు హనుమంత్ సిండే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బండరెంజల్ గ్రామానికి చెందిన బాధితురాలు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నిధులు రావడంతో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సిండే శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపిపి అశోక్ పటేల్ మాజీ జడ్పిటిసి సాయిరాం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రాజు, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, శాంతాపూర్ ఎంపీటీసీ చంద్రకళ, బండరెంజల్ మాజీ సర్పంచ్ రామిరెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్పటేల్, బిచ్కుంద నాయకులు నూకల రాజు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సిద్దిరాములు నాయకులు బొమ్మల లక్ష్మణ్ జాగృతి నాయకులు ఎన్ఎం బాల్రాజ్, తెలంగాణ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి భూమయ్య పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.