ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు నేడు 2.3.వ వార్డు (చుక్కాయి పల్లి )లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ జగ్గు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలి యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, కొల్లాపూర్ మండల అధ్యక్షుడు పరశురాం, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తఫా, మండలం మైనార్టీ సెల్ రఫి, వసంత కుమార్ పాల్గొన్నారు.
ఇంకా కాంతారావు, బింగి సాయిలు, కంటే శివన్న, గోపాల్, ఖాదర్, బాబా, కలమంద శేఖర్, క్రాంతి, మారేడి శీను, క్రాంతి, కిరణ్, కురుమయ్య, శీలం వెంకటేష్ ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాల్సిందిగా వారు కోరారు. కొల్లాపూర్ కోటపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.