భారత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు తాము వ్యతిరేకమని ఈ పర్యటన తో భారత్ కు ఒనగూరే ప్రయోజనేమేమి లేదనిసీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శించారు.శనివారం మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో ఆయన ప్రసంగీస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత నిరసనలను కేసీఆర్ సహించ లేక పోతున్నారని ఉద్యమాలను అణచడం తో పాటు నిరసనలు తెలిపే అవకాశం ఇవ్వడం లేదని అయన విమర్శించారు.
భారత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు తాము వ్యతిరేకమన్నారు. అగ్రరాజ్య అధినేత పర్యటన భారతదేశ ప్రయోజనాలకు విఘాతమని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు రాజా స్పష్టంచేశారు. ఈ మహాసభల్లో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.