వృద్ధుడిని చితక బాది అతడి వద్ద ఉన్న విలువైన వజ్రం దోచుకెళ్లారు దుండగులు.కడపలో పట్టణ శివారులోని చిలకలబావి వీధికి చెందిన ఖాదర్ బాషా (60) 2009లో చెన్నైలో 113 కేరట్ల బరువున్న వజ్రాన్ని రూ. 25 వేలకు కొనుగోలు చేశాడు. అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో బాషా వద్ద విలువైన వజ్రం ఉందని తెలుసుకున్నరత్నాల వ్యాపారి షాహీద్ హుస్సేన్ కడప చేరుకొని బాషా వద్ద ఉన్న వజ్రాన్ని చూసేందుకు వెళ్లిన హుస్సేన్, అతడి స్నేహితుడు బాషాపై దాడిచేశారు. అతడి నుంచి వజ్రాన్ని లాక్కుని వెళ్లిపోయారు.
తీవ్రంగా గాయపడిన తండ్రిని రిమ్స్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.