32.2 C
Hyderabad
March 29, 2024 01: 03 AM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ సేఫ్: పుకార్లు నమ్మద్దు ఇబ్బందులు తెచ్చుకోవద్దు

Anjaneekumar

పుకార్లు నమ్మవద్దని మత ఉద్రిక్తతలకు లోను కావద్దని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాతబస్తీలో పర్యటించి ప్రజలను కోరారు. చార్మినార్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలువురిని కలుసుకుని మత సామరస్యానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా తాము చూస్తున్నామని, పౌరులు సహకరించాలని ఆయన కోరారు.

సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నమ్మ వద్దని, సమీపంలోని పోలీసులను అడిగి వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడేవారిని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరని ఆయన ధ్యైర్యం చెప్పారు. ఈ పర్యటనలో కమీషనర్ అంజనీ కుమార్ తో బాటు చార్మినార్ ఏసిపి అంజయ్య ముఖ్యమైన పోలీసు అధికారులు ఉన్నారు.

Related posts

మంత్రి వేముల సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

జాబ్ లాస్: ఉద్యోగాలు కోల్పోనున్న పెద్దలు

Satyam NEWS

తిరుమల శ్రీవారి సేవలో బేతి , పన్నాల

Satyam NEWS

Leave a Comment