పుకార్లు నమ్మవద్దని మత ఉద్రిక్తతలకు లోను కావద్దని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాతబస్తీలో పర్యటించి ప్రజలను కోరారు. చార్మినార్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలువురిని కలుసుకుని మత సామరస్యానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా తాము చూస్తున్నామని, పౌరులు సహకరించాలని ఆయన కోరారు.
సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నమ్మ వద్దని, సమీపంలోని పోలీసులను అడిగి వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడేవారిని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరని ఆయన ధ్యైర్యం చెప్పారు. ఈ పర్యటనలో కమీషనర్ అంజనీ కుమార్ తో బాటు చార్మినార్ ఏసిపి అంజయ్య ముఖ్యమైన పోలీసు అధికారులు ఉన్నారు.