39.2 C
Hyderabad
April 25, 2024 18: 40 PM
Slider ఆంధ్రప్రదేశ్

పోలీస్ వ్యూ: రాజధాని లో పోలీసుల ఆంక్షలు డ్రోన్ల సాయంతో పహారా

drones watch

అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని కవాతు నిర్వహించి, మైకుల ద్వారా సూచించారు. 

వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో టెంట్లు వేసేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఎండలోనే కూర్చుని రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తుళ్లూరులో ఓ ప్రైవేటు స్థలంలో రైతులు కూర్చోగా… పోలీసులు అక్కడకు కూడా వచ్చారు. దీంతో, గేటుకు రైతులు తాళం వేశారు. ఈ నేపథ్యంలో, ఆ ప్రైవేటు స్థలంపై పోలీసులు డ్రోన్ ద్వారా నిఘా పెట్టారు.

Related posts

వితంతువులు మనోధైర్యంతో ముందుకు సాగాలి

Satyam NEWS

భర్తతో విడిపోయిన మహిళను కిరాతకంగా హింసించిన కుటుంబ సభ్యులు

Satyam NEWS

పేదలకు ఆహారం పంచుతున్న ప్రజా సంఘాలు

Satyam NEWS

Leave a Comment