మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన రండి.. సరదాగా నవ్వుకుందాం కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుని, ప్రభుత్వ సలహాదారు K V రమణ చారి లను సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కళలను, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ ఛైర్మన్ బాద్మి శివ కుమార్, మహతి క్రియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.