లండన్ సదస్సులో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురైన మృతి చెందిన నిమ్స్ వైద్యురాలు మీనా కుమారి మృతదేహం హైదరాబాద్ తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్ , వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో హుజురాబాద్ నుండి మంత్రి ఫోన్ లో మాట్లాడారు.
ఇంకా అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించలేదని ఆ ప్రక్రియ పూర్తి కాగానే మృతదేహంను తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.