కామారెడ్డి జిల్లాలో ఆబ్కారీ అధికారులు గంజాయి మొక్కలపై ప్రత్యేక నిఘా వేసి ఉంచడంతో పెద్ద ఎతున గంజాయి మొక్కలు దొరికాయి. కామారెడ్డి జిల్లా మద్దూనుర్ మండలంలోని పెద్ద తడుగురు గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచారన్న సమాచారంతో ఆబ్కారీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
బిచ్కుంద ఆబ్కారీ సీఐ సుధాకర్ గౌడ్ తన సిబ్బందితో దాడులు నిర్వహించగా యాభై నాలుగు గంజాయి మొక్కలను ధ్వంసం చేసి వాటిని తగులబెట్టారు. వాటిని పెంచిన ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. వారిలో శివలింగప్ప ను అదుపులోకి తీసుకోగా మరొక నిందితుడు భీమ్ రావ్ పటేల్ పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు.