ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని మెడికల్ శాంపుల్స్, మెడికల్ రిపోర్టులు తగలబడి పోయినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్నరోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక రోగి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. కొన్నిఆపరేషన్ థియేటర్లు కూడా కాలిపోయాయి. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేశారు. 22 అగ్నిమాపక దళాలను వినియోగించినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఈ అగ్ని ప్రమాదం జరిగిన బ్లాక్ లో లేరు.
previous post