ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఒకే ఇంట్లో అయిదుగురు చనిపోయి కనిపించారు. వారు చనిపోయి కూడా నాలుగైదు రోజులు అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. భార్యా భర్తాతో పాటు వారి ముగ్గురి పిల్లలుగా వీరిని గుర్తించారు. ఈశాన్య ఢిల్లీలోని భజన్పురాలో ఈ ఘటన జరిగింది. స్వంత ఇంట్లోనే వాళ్లు శవాలుగా తేలారు. కనీసం నాలుగు రోజుల ముందే వాళ్లు మరణించినట్లు అనుమానిస్తున్నారు.
ఆ అయిదుగురి శరీరాలు కుల్లిపోయినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇంటి యజమాని శంబు అనే వ్యక్తి ఈ-రిక్షా నడిపే వాడని గుర్తించారు. ఆరు నెలల క్రితమే ఆ ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి చేరినట్లు తేలింది. నేడు శవాలు కుళ్లిన వాసన వస్తే పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.