వలస కార్మికులకు నిత్యావసరాల కిట్లు పంపిణి కార్యక్రమాన్ని కనెక్ట్ టూ ఆంధ్ర CEO వి.కోటేశ్వరమ్మ చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు అక్షయపాత్ర కార్యాలయంలో దీన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఆకలితో పేద ప్రజలు ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.
డా. రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా పదివేల కుటుంబాలు, లలితారైస్ బ్రాండ్ ద్వారా వెయ్యి కుటుంబాలకు, ఇన్ఫోసిస్ ద్వారా నాలుగువేల వలస కుటుంబాలకు సహయం అందచేస్తున్నారు. నిత్యావసరాల కిట్లో పది కిలోల బియ్యం,కేజి కందిపప్పు,నూనె, సేమ్య వంటి వస్తువులు ఉంటాయి. గుంటూరు జిల్లాలోని 14 మండలాలోని వ్యవసాయ కూలీలకు,వలస కార్మికులకు ఈ నిత్యావసరాలు అందచేస్తారు.