38.2 C
Hyderabad
April 25, 2024 14: 53 PM
Slider హైదరాబాద్

జగన్ గురూజీ ఆధ్వర్యంలో 350 మందికి ఆహారం పంపిణీ

Jagan Gurujee

లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు ఆహారం లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో  శ్రీ మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటేబుల్ ట్రస్ట్ నిత్యం కార్యక్రమాలు చేపడుతున్నది. శ్రీ జగన్ గురూజీ ఆధ్వర్యంలో నేడు గాజులరామరం, జగద్గిరిగుట్ట, అల్విన్ కాలనీ, ధర్మారెడ్డి కాలనీ, సీబీసీఐడీ కాలనీ, కేపిహెచ్ పొలీస్ స్టేషన్, మూసాపేట తదితర ప్రాంతలలోని నిరుపేదలకు ఆహారం అందచేశారు.

ఈ ప్రాంతాలలో అత్యధిక శాతం నిరుపేదలు ఉంటారు. పక్క రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చిన వారు, దినసరి కూలీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఆహారం అందచేయాలని  శ్రీ జగన్ గురూజీ ఆదేశించడంతో సుమారు 350 మందికి నేడు ఆహారం అందించారు. శ్రీ మాతయోగ అన్నపూర్ణేశ్వరి మాత ప్రసాదం పేరుతో ఈ రోజు పాలక్ రైస్, పెరుగు అన్నం, రాగి రొట్టె, మేథీ రోటీ, మిక్సుడ్ వెజ్ కుర్మా, వాటర్ మెలన్ జ్యూస్ అందించారు.

Related posts

తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Satyam NEWS

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

Satyam NEWS

నిన్న 70 మంది… తాజాగా 50మంది డీఎస్పీ లకు పోస్టింగ్స్…!

Bhavani

Leave a Comment