కష్టాలు వచ్చినప్పుడే మానవత్వం వెలుగులోకి వస్తోంది. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే గుండె ధైర్యంతో పాటు మానవత్వం ఉన్న మనుషులు ముందుకొస్తేనే సాధ్యమవుతుంది. మనం బాగుండడమే కాదు… మన చుట్టుపక్కల ఉన్నవారు,ఎలాంటి ఆశ్రయం లేనివారు, కష్టాల్లో ఉన్నవారిని సైతం ఆదుకోవడానికి ఎంతో పెద్ద మనసు ఉండాలి. అలాంటి మనసు తమకు ఉందని నిరూపిస్తున్నారు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు.
పాతపట్నం మండలంలోని లాక్డౌన్ జరిగినప్పటి నుంచి ఆహారం లేక అవస్థలు పడుతున్న వారికి మేమున్నామని… మీ ఆకలి తీరుస్తామని మామిడి గోవిందరావు ముందుకొచ్చారు. ఆహారం లేక అవస్థలు పడుతున్న కుటుంబాలకు వారికి సరిపడే నిత్యావసర సరుకులు ఇంటి ఇంటికి వెళ్లి అందజేస్తూ ఆపన్నహస్తం అందిస్తున్నారు.
ఈ రోజు పాతపట్నం మండలంలోని దాసుపురం, బురికి పేట, బగంతర, రంకీణి గ్రామాలతో పాటు పాతపట్నంలోని హరిజన వీధి, రెల్లి వీధి తదితర విధుల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.