32.2 C
Hyderabad
March 29, 2024 01: 05 AM
Slider కడప

కరోనా లాక్ డౌన్ ముగిసే వరకు సిబ్బందికి ఆహారం

aakepati 281

కరోన వ్యాధి నివారణకు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది కి, వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బంది కి, యన్.సి.సి. విద్యార్థులకు కడప జిల్లా రాజంపేట మాజీ శాసనసభ్యుడు, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య అధ్యక్షుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి అకేపాటి భవన్ లో అన్నదానం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ట కాలంలో అకేపాటి భవన్ లో భోజనాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. దయచేసి ప్రజలు ఎవరు ఇంటి వదిలి బయటికి రావద్దు అని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఎంతో మంది సిబ్బంది ప్రజల కోసం కష్టపడుతున్నారని అందువల్ల ప్రజలు క్రమశిక్షణ పాటించాలని కోరారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన లాక్ డౌన్ సూచనలు పాటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట రోటరీ క్లబ్ సెక్రెటరీ లాయర్ ప్రతాప్ రెడ్డి, రోటరీ క్లబ్ కోశాధికారి హరినాథ్ చౌదరి, రోటరీ క్లబ్ పీఆర్వో మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంకా పోలి మురళీ మోహన్ రెడ్డి, ఈనాడు శ్రీను, పోలి వేణు, డీసీఎంఎస్ చైర్మన్ దండు గోపి, పాపినేని విశ్వనాథ్ రెడ్డి, అమర్, జీవి సుబ్బరాజు తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

సెల్ ఫోన్ వెలుతురులో చంద్రబాబు ప్రసంగం

Satyam NEWS

ప్రజారోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

Satyam NEWS

చలో హైదరాబాద్ కు కదిలిన కార్మిక సైన్యం

Satyam NEWS

Leave a Comment