32.2 C
Hyderabad
April 20, 2024 21: 58 PM
Slider సినిమా

గో గ్రీన్: హీరోయిన్ కీర్తి సురేష్ గ్రీన్ ఛాలెంజ్

keerthi suresh

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో ప్రముఖ సినిమా హీరోయిన్ (మహానటి ఫేమ్) కీర్తి సురేష్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ఎంతో మంచి కార్యక్రమమని ఈ సందర్భంగా కీర్తి సురేష్ అన్నారు. మొక్కలు నాటిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటాను. నా లాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పొల్యూషన్ పెరుగుతున్న ఈ సమయంలో ఈ కార్యక్రమంలో  అందరూ పాల్గొని చెట్లను పెంచాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,  ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Related posts

ఢీ అంటే ఢీ: రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్

Satyam NEWS

క్రైమ్ స్టాఫ‌ర్ నెంబ‌ర్ స్థానంలో…బాధితుల కోసం కొత్త వాట్సాప్ నెంబ‌ర్..!

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి నాడు వేడుక‌గా స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం

Satyam NEWS

Leave a Comment