అన్నార్తులను అందుకుంటూ ముందుకు సాగుతున్న గురురాఘవేంద్ర స్వామి వారి ట్రస్ట్ సేవలు మరువరానివని శ్రీకాకుళం డిఎస్పీ డిఎస్ఆర్ వి.ఎస్. ఎన్. మూర్తి అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్లు కూడలిలో గురురాఘవేంద్ర స్వామి దేవాలయం వ్యవస్థాపకులు బరాటం కామేశ్వరరావు కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, మీడియా ప్రతినిధుల కు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ మాట్లాడుతూ మండుటెండలో పగలు రాత్రి లు తేడాలేకుండా లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్, మీడియా సేవలు సమాజం గుర్తించి ఇట్లాంటి దాతృత్వాన్ని చాటుకుంటున్నకామేశ్వరరావు అందరికీ ఆదర్శంగా నిలుస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో గురురాఘవేంద్ర ట్రస్ట్ ప్రతినిధులు కొంఖ్యాన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు, పైడి నిర్మల్ కుమార్, ఎన్. అప్పారావు, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.