కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రంలో కొలువుదీరిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి మొదటి రోజు ఆయన ఆలయంను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
జుక్కల్ నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ రావు, కొడప్గల్ ఎంపిపి ప్రతాప్రెడ్డి, సాయగౌడ్, అన్నారం వెంకట్రెడ్డి, సురేష్ గౌడ్, విజయ్ తదితరులున్నారు.