28.7 C
Hyderabad
April 20, 2024 09: 58 AM
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు

CBN Security

టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి భద్రత వ్యవహారంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్లోజ్ డ్ సెక్యూరిటీ ఎవరి పని అనే అంశంపై ఎన్ ఎస్ జీ, స్టేట్ సెక్యూరిటీ మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. అలాగే, చంద్రబాబు కాన్వాయ్ లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు సీఎస్ వోను ప్రభుత్వం నియమించవచ్చని హైకోర్టు తెలిపింది. తన భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టులో ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు తీర్పును రిజర్వు చేశారు. తాజాగా నేడు ఆ కేసుపై తుది తీర్పును వెల్లడించారు.

Related posts

సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా సైబర్ క్రైం యూనిట్స్

Satyam NEWS

నాడు బ్రిటిష్, నేడు కేసీఆర్ పాలన రెండు ఒకటే

Satyam NEWS

ఇప్పుడు ముస్లింలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment