ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యల పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికపై చర్చించబోయే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సమావేశంలో పాల్గొనకుండా సౌదీ అరేబియా ఇరాన్ను అడ్డుకుంది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సేయెద్ అబ్బాస్ మౌసావి మాట్లాడుతూ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుస్సేన్ జాబెరి నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందానికి సౌదీ అరేబియా వీసాలు నిరాకరించింది.
గత వారం ట్రంప్ ఆవిష్కరించిన శాంతి ప్రణాళికపై ముస్లిం మెజారిటీ దేశాలతో కూడిన యాభై ఏడు సభ్యుల ఓఐసి సమావేశం సోమవారం ఏర్పాటు చేస్తుంది.సౌదీ అరేబియా మరియు ఇరాన్ చాలా సంవత్సరాలు ప్రాక్సీ యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి.దీనితో ఇరాన్ శాంతి ఒప్పంద కట్టుబాట్లు ఉల్లంగిస్తుందని ఆరోపిస్తూ వారిని సమావేశానికి రాకుండా అడ్డుకుంది.