32.2 C
Hyderabad
March 28, 2024 21: 20 PM
Slider కరీంనగర్

మనీ మేక్స్: రాయికల్ లో భార్యపై గొడ్డలి కత్తితో దాడి

jagityal raikal husband attacked wife axe knife

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. రాయే లక్ష్మణ్ అనే వ్యక్తి తన భార్య స్వరూపపై గొడ్డలి, కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు. లక్ష్మణ్ గతంలో విదేశాలకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఇక్కడే నివసిస్తున్నాడు. ఆ భార్యాభర్తలిద్దరూ డబ్బుల కోసమే తరచూ గొడవ పడేవారని, ఆదివారం కూడా డబ్బుల విషయంలోనే గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తీవ్ర గాయాల పాలైన స్వరూపను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాయే లక్మన్ – స్వరూప దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. రాయికల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామికి హనుమత్ సేవ

Satyam NEWS

సిపిఐ సీనియర్ నేత దాస్ గుప్తా ఆకస్మిక మృతి

Satyam NEWS

గోరక్ పూర్ టు యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ వయా జమ్మికుంట

Satyam NEWS

Leave a Comment