హెడ్డింగ్ తప్పు అనుకుంటున్నారా కాదు. కరెక్టే చదివారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అదే పార్టీకి చెందిన నాయకుడు ఒకరు కేసుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుల మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆ పార్టీ క్రైస్తవుల సంఘం నేత అలివర్ రాయ్ అన్నారు.
పున్నమిఘాట్లో మత మార్పిడిలు జరుగుతు న్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అలివర్ రాయ్ డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకూ ఎటువంటి పశ్చాత్తాపం, స్పందన పవన్ కళ్యాణ్ నుండి లేదని, అందువలనే తానే కేసు పెట్టానని అలివర్ రాయ్ తెలిపారు.