40.2 C
Hyderabad
April 24, 2024 18: 55 PM
Slider జాతీయం

నేడు ఆఖరి పనిదినాన్ని ముగించుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా

ranjan gogoi

భారత న్యాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అయోధ్య భూ వివాదంపై తీర్పు ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేడు తన చివరి పనిదినాన్ని ప్రత్యేకంగా ముగించారు. తన ధర్మాసనంలో విచారణకు లిస్ట్‌ అయిన పిటిషన్లకు ఒకేసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 17 వ తేదీన రంజన్‌ గోగోయ్‌ పదవీవిరమణ చేయనున్నాను. అందుకోసం ఇదే ఆయనకు భారత ప్రధాన న్యాయమూర్తిగా చివరి పని దినం.అందుకే ప్రధాన న్యాయమూర్తిగా తన చివరి పనిదినాన్ని జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌ శుక్రవారం ప్రత్యేకంగా చేసుకున్నారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రంజన్‌ గోగోయ్‌ కు సా 4 గం.లకు వీడ్కోలు పలకనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే (63) ఈ నెల 17 న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Related posts

గజ్వేల్ వస్తామంటే భయమెందుకు?: ఎమ్మెల్యే రఘునందన్

Satyam NEWS

మంత్రి కేటీఆర్ డూప్ పిఏలు ఇద్దరి అరెస్టు

Satyam NEWS

ములుగు జిల్లా లోని రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

Satyam NEWS

Leave a Comment